హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ (శంషాబాద్)ను బుల్లెట్ ట్రైన్ హబ్గా పిలువాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం ఎంసీఆర్హెచ్చార్డీ బోధి పెవిలియన్లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, వరంగల్ ఎయిర్పోర్టుపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్-పుణె రైల్వే మార్గంలో వికారాబాద్లోని అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
హైదరాబాద్ టు బెంగళూరు హైస్పీడ్ రైల్వేలైన్లో భాగంగా ఫ్యూచర్ సిటీలో స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. మన్ననూర్ దగ్గర నల్లమల స్టేషన్, సోమశిల సమీపంలో స్టేషన్ ఏర్పాటుకు ప్లాన్ చేయాలని సూచించారు. టూరిజం ప్రాంతాలకు రైల్వేలైన్ ఉండాలని పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్లో కాకతీయ సామ్రాజ్యం, వారసత్వ సంపద ఉట్టిపడాలని తెలిపారు.