హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిర్మాణానికి సంబంధించి రెండు విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రెండు ‘పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్-2023’ అవార్డులు సాధించినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
ఈ అవార్డును ఈ నెల 15న ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఎస్సీఆర్ జీఎం అరుణ్కుమార్ జైన్కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అందజేయనున్నారు.