హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోఖా తుఫానుగా మారబోతుందని, దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడనున్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు రాష్ట్రంలో శుక్రవారం నుంచి పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది.
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం పలు చోట్ల వర్షం పడగా, పిడుగు పాటుకు గురై ములుగు జిల్లా అకినేపల్లిమల్లారం సమీపంలో రైతు గగ్గూరి చిన్ని(52) మృతి చెందాడు.