Summer | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 16 నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసిందని చెప్పారు.
నిర్మల్, నల్లగొండ, ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో వర్షం పడిందని, అందుకే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలుగా నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డాటా ప్రకారం.. సోమవారం చాలా ప్రాంతాల్లో 33 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.