ఎంబీబీఎస్ విద్యార్థి సాయిరాంకు అరుదైన గౌరవం
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : హైదరాబాద్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి పిల్లారిశెట్టి సాయిరాంకు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయిరాం.. ‘హెల్త్ హీరో’ విభాగంలో మంగళవారం బ్రిటిష్ పార్లమెంట్లో ప్రసంగించారు. ప్రపంచాన్ని కొవిడ్ అతలాకుతలం చేసిందని, కొన్ని పేదదేశాలు కేవలం 12% మాత్రమే మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తిచేసుకోగలిగాయని వెల్లడించారు. ప్రపంచ దేశాలు కొవిడ్తోపాటు క్యాన్సర్ను ఎదుర్కోవటానికి కృషి చేస్తున్నాయని వివరించారు. హైదరాబాద్లోని ఉషాలక్ష్మి ఫౌండేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ను ఎదుర్కోవటానికి ప్రపంచంలోనే మొదటిసారిగా మొబైల్ యాప్ను రూపొందించిందని తెలిపారు. యునిసెఫ్ నిర్వహించిన సేవ్ చిల్డ్రన్ క్యాం పెయిన్లో పాల్గొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా నలుగురు హెల్త్ హీరోలను ఎంపిక చేయగా అందులో సాయిరాం ఒకరు. సాయిరాం తండ్రి పీ రఘురాం ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ వైద్యుడు.