బహూకరించిన హైదరాబాదీ డాక్టర్
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని హైదరాబాద్కు చెందిన వైద్యుడు మంద రామకృష్ణ బహూకరించారు. 707 గ్రాముల బంగారు కిరీటంలో 35 గ్రాముల అమెరికన్ డైమండ్లు పొదిగి ఉన్నట్టు శ్రీ సాయిబాబా ట్రస్ట్ సీఈవో తెలిపారు.
1992లో రామకృష్ణ కుటుంబ సమేతంగా సాయిబాబా ఆలయాన్ని దర్శించారు. ఆ సందర్భంగా ఆలయ పూజారి బంగారు కిరీటాన్ని చూపించి ఇలాంటి మరో కిరీటాన్ని స్వామివారికి బహూకరించాలని సూచించారు. తన భార్య కోరిక మేరకు షిర్డీసాయికి బంగారు కిరీటాన్ని ఇచ్చి మొక్కు చెల్లించారని సీఈవో శుక్రవారం వెల్లడించారు.