శంషాబాద్ రూరల్, ఆగస్టు 12: శంషాబాద్ ఎయిర్పోర్టులో 4.86 కోట్ల వి లువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుం చి వచ్చిన ప్రయాణికుడు 2 కిలోల బం గారం కడ్డీలను ప్యాంటులో దాచుకొని తీసుకొచ్చి తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ బంగారం విలువ రూ.1.21 కోట్లు.
మరో ప్రయాణికుడు అదే తరహాలో రూ.1.08 కోట్ల విలువైన 1.78 కిలోల బంగారం త రలిస్తుండగా దొరికిపోయాడు. షార్జా నుంచి మరో ప్రయాణికుడు పేస్ట్ రూపం లో రూ.1.31 కోట్ల విలువైన 2.17 కిలో ల బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డాడు. రూ.1.24 కోట్ల విలువైన 2.05 కిలోల బంగారాన్ని ఇంకో వ్యక్తి దుబాయ్ నుంచి లోదుస్తుల్లో దాచుకొచ్చి చిక్కాడు. నలుగురి నుంచి మొత్తం 8.015 కిలోల బం గారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడి న మొత్తం బంగారం విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.