Yadadri Temple | యాదగిరిగుట్ట : దాదాపు 8 వేల చాక్ పీస్లతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నమూనాను రూపొందించారు హైదరాబాద్లోని కార్వాన్కు చెందిన సూరం సంపత్కుమార్. కళలపై ఆయనకు ఉన్న అభిరుచితో ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మించి గ్లాస్ అక్వేరియంలో అమర్చారు.
శుక్రవారం దాన్ని ఈవో ఎన్ గీతకు అందజేశారు. సంపత్కుమార్ జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చి 22 ఉగాది రోజున ఈ ఆలయ నమూనా తయారీని ప్రారంభించి, దాదాపు 5 నెలలు కష్టపడి పూర్తిచేసినట్టు ఆయన పేర్కొన్నారు.