హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో 21 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుక్రవారం నూ తన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్యతోపాటు నాలుగు జిల్లాలకు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులుగా, సీపీలు, ఎస్పీలుగా వారంతా విధుల్లో చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది ఉన్నతస్థాయి అధికారులను బుధవారం బదిలీ చేసింది. వారి స్థానాల్లో నూతన అధికారులను నియమించాలని ప్రభుత్వానికి సూచించింది.
ఈసీ సూచనల మేరకు అధికారులకు పోస్టింగ్ ఇస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ప్రస్తుతం పోలీసు అకాడమీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్ శాండిల్యను నియమించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏడీజీగా ఆయనకు అదనపు బాధ్యతలూ అప్పగించారు. కొత్తగా నియమితులైన అధికారులు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలలోగా బాధ్యతలు చేపట్టాలన్న సీఎస్ ఆదేశాలతో ఆ గడువులోగా అందరూ బాధ్యతలు స్వీకరించారు.