హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతూ తప్పించుకు తిరుగుతున్న ఘరానా స్మగ్లర్ ఎడ్విన్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గోవాలో ఎడ్విన్ను పట్టుకొన్న పోలీసులు శుక్రవారం రాత్రి హైదరాబాద్కు తీసుకొని వచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం మీడియాకు వెల్లడించారు. గోవా ప్రాంతానికి చెందిన ఎడ్విన్ నన్స్ అలియాస్ ఎడ్విన్ (45) పదేండ్ల క్రితం వరకు గోవాలో రెస్టారెంట్లు, షాక్స్లలో వెయిటర్గా పనిచేశాడు. అక్కడికి వచ్చే టూరిస్టులతో పరిచయం పెంచుకొని.. వాళ్లు వాడే డ్రగ్స్ గురించి తెలుసుకొన్నాడు. దానికి సంబంధించిన సైప్లె నెట్వర్క్పై అధ్యయనం చేశాడు. తరువాత డ్రగ్స్ దందాలోకి దిగాడు. దేశవ్యాప్తంగా 50 వేల మంది కస్టమర్లను సంపాదించాడు.
తక్కువ కాలంలోనే వందల కోట్లకు
డ్రగ్స్ వ్యాపారంలో తక్కువ కాలంలోనే వందల కోట్లు సంపాదించాడు. గోవాలో రెండు ఎస్టేట్లు నిర్మాణం చేశాడు. ఇతను ఏర్పాటు చేసిన కర్లీషాక్ దేశంలోనే పేరుమోసింది. గోవాలో ఒక హత్య కేసుతోపాటు నాలుగు కేసులు ఇతడిపై నమోదయ్యాయి. హైదరాబాద్లోని లాలాగూడ, ఉస్మానియా యూనివర్సిటీ, రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. ఆగస్టు 16న ఎస్టసీ, ఎల్ఎస్డీ బ్లాట్స్, ఎండీఎం మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ప్రీతిష్ నారాయణ్ బోర్కర్ను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో నిందితుడిని విచారించగా గోవా లింకులు బయటపడ్డాయి. తుకారామ్ సల్గొవ్కర్ అలియాస్ నానా, వికాస్ నాయక్, రమేశ్ చౌహాన్, స్టివ్, ఎడ్విన్, సంజయ్ గవేకర్ల వద్ద నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు హెచ్-న్యూ పోలీసులు, రామ్గోపాల్పేట్ పోలీసులు కలిసి ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోవాకు వెళ్లి సంజయ్ గవేకర్, స్టివ్ తదితరులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తర్వాత ప్రధాన నిందితుడైన ఎడ్విన్ కోసం గాలింపు చేపట్టారు.
రెండు నెలలు వేట
ఎడ్విన్కోసం పోలీసులు రెండు నెలలు వేటాడారు. ఈ కేసులో బెయిల్ కోసం ఎడ్విన్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు కూడా పోయాడు. అక్కడ కేసు విచారణలో ఉండగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎడ్విన్ అరెస్టుతో అక్కడి పోలీసులు ‘ పీడ పోయింది, చాలా చాలా థ్యాంక్స్’ అంటూ మన పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
షాక్స్ కూల్చివేయించాం: సీవీ ఆనంద్
మేం ఒత్తిడి చేసి ఎడ్విన్కు చెందిన షాక్స్ కూల్చివేయించాం. అతడికి చాలా పరపతి ఉంది. అతడి కట్టడాలను టచ్ చేసేందుకు ఎవరూ సాహసించరు. వాటికి ఎలాంటి అనుమతులు ఉండవు. గోవా పోలీసులు సహకరించడం లేదని మేము ఒత్తిడి తేవడంతో అప్పుడు వారు దిగివచ్చారు. దేశంలో 600 మంది వినియోగదారులు ఉంటే తెలంగాణలో 160 మంది ఎడ్విన్ లిస్ట్లో ఉన్నారు. ఎడ్విన్ వంటి కింగ్పిన్ల అరెస్టుతో 1200 మంది వినియోగదారులకు విముక్తి కల్పించినైట్లెయింది. నో సైప్లె ఆఫ్ డ్రగ్ టు హైదరాబాద్ అండ్ తెలంగాణ అంటూ డార్క్ వెబ్లో పోస్టులు పెడుతున్నారు. ఇది ఘన విజయంగా చెప్పవచ్చు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నాను. డ్రగ్స్ కేసుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉండడం బాధాకరం. తల్లిదండ్రులు జాగ్రతగా తమ పిల్లలను పర్యవేక్షించాలి.