కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు అన్నారు. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ సన్నాహాక సమావేశాల్లో కే.కేశవరావు పాల్గొన్నారు.
ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించామని పార్టీలో కే.కేశవరావు తెలిపారు. వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలే హీరోలు అని ఆయన తెలిపారు. ఏ గాలి కూడా హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేకపోయిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధఙని హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్లో యువతను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్లు ఏర్పాటు చేసుకుందామని అన్నారు.