Huzurabad | హుజూరాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే సంక్షేమ పథకాలు, చేస్తున్న పనులకు యువత ఆకర్షితులవుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ పట్టణానికి చెందిన వంద మంది యువకులు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీ కార్యాలయంలో యువకులకు సాదరస్వాగతం పలికారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో యువతకు పెద్దపీట వేస్తామన్నారు. యువకులు ఉరిమే ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.