హుజూరాబాద్ : సంక్షేమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇల్లందకుంట మండలంలోని గడ్డివానిపల్లి గ్రామ మహిళలు అండగా నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో మహిళలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మహిళలు ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ.. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహిళల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులు, వృద్ధులకు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులకు నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మహిళలు తెలిపారు.