టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని TRS పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు SC కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అటు.. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భూమి పూజలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు ఆ వేడుకకు హాజరయ్యారు.