కరీంనగర్ : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
హుజూరాబాద్ లో స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి హాజరయ్యారు. మంత్రి హరీశ్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు మహిళా సంఘం భవన నిర్మాణానికి మత్రులు హరీశ్ రావు, గంగుల భూమి పూజ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.