19వ రౌండ్లోనూ ఆధిక్యంలో బీజేపీ
టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3047 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో బీజేపీకి 5916 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 2869 ఓట్లు వచ్చాయి. మొత్తానికి 19,541 ఓట్ల మెజార్టీతో బీజేపీ మొదటిస్థానంలో ఉంది.
18వ రౌండ్లోనూ ఆధిక్యంలో బీజేపీ
టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1876 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో బీజేపీకి 5611 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 3735 ఓట్లు వచ్చాయి. మొత్తానికి 16,494 ఓట్ల మెజార్టీతో బీజేపీ మొదటిస్థానంలో ఉంది.
పదిహేడో రౌండ్లోనూ బీజేపీ లీడ్
17వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 4,187 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 5,610 ఓట్లు, కాంగ్రెస్కు 203 ఓట్లు పోలయ్యాయి.
17 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 14,618 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 65,167 ఓట్లు రాగా, బీజేపీకి 79,785 కాంగ్రెస్కు 2,266 ఓట్లు వచ్చాయి.
16వ రౌండ్లోనూ ఆధిక్యంలో బీజేపీ
16వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1742 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో బీజేపీకి 5689 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 3977 ఓట్లు వచ్చాయి. మొత్తానికి 13,195 ఓట్ల మెజార్టీతో బీజేపీ మొదటిస్థానంలో ఉంది.
పదిహేనో రౌండ్లోనూ బీజేపీ లీడ్
15వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 3,358 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 5,407 ఓట్లు, కాంగ్రెస్కు 149 ఓట్లు పోలయ్యాయి.
15 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 11,483 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 57,003 ఓట్లు రాగా, బీజేపీకి 68,486 కాంగ్రెస్కు 2,131 ఓట్లు వచ్చాయి.
14వ రౌండ్లో బీజేపీకి 1046 ఓట్ల ఆధిక్యం!
14వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1046 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో బీజేపీకి 4346 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 3700 ఓట్లు వచ్చాయి.
పదమూడో రౌండ్లోనూ బీజేపీ లీడ్
13 వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 2,971 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,836 ఓట్లు, కాంగ్రెస్కు 101 ఓట్లు పోలయ్యాయి.
13వ రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 8,388 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 49,945 ఓట్లు రాగా, బీజేపీకి58,333 కాంగ్రెస్కు 1830 ఓట్లు వచ్చాయి.
పన్నెండో రౌండ్లోనూ బీజేపీ లీడ్
పన్నెండో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 3,632 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,849 ఓట్లు, కాంగ్రెస్కు 158 ఓట్లు పోలయ్యాయి.
పన్నెండు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 6,523 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 46,974ఓట్లు రాగా, బీజేపీకి 53,497 కాంగ్రెస్కు 1729 ఓట్లు వచ్చాయి.
పుంజుకుంటున్న టీఆర్ఎస్.. 11వ రౌండ్లో ఆధిక్యంలోకి..
11వ రౌండ్లో టీఆర్ఎస్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈటల రాజేందర్పై, గెల్లు శ్రీనివాస్ 367 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
11వ రౌండ్లో టీఆర్ఎస్కు 4,326 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత 11వ రౌండ్ వరకూ 39,016 ఓట్లు టీఆర్ఎస్కు పోలయ్యాయి.
పదో రౌండ్లోనూ బీజేపీ లీడ్
పదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 3,709 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,295 ఓట్లు, కాంగ్రెస్కు 118 ఓట్లు పోలయ్యాయి.
పది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 5,691 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 39,016ఓట్లు రాగా, బీజేపీకి 44,707 కాంగ్రెస్కు 1487 ఓట్లు వచ్చాయి.
తొమ్మిదో రౌండ్లో బీజేపీ లీడ్
తొమ్మిదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 3,470 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 5,305 ఓట్లు, కాంగ్రెస్కు 174 ఓట్లు పోలయ్యాయి.
తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 5,105 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 35,307 ఓట్లు రాగా, బీజేపీకి 40412, కాంగ్రెస్కు 1,349 ఓట్లు వచ్చాయి.
8వ రౌండ్లో టీఆర్ఎస్కు ఆధిక్యం
ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 162 ఓట్ల మెజార్టీ వచ్చింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4,248 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,086 ఓట్లు, కాంగ్రెస్కు 89 ఓట్లు పోలయ్యాయి.
ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 3,270 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 31,837 ఓట్లు రాగా, బీజేపీకి 35,107, కాంగ్రెస్కు 1,175 ఓట్లు వచ్చాయి.
ఆరో రౌండ్లో బీజేపీకి 1017 ఓట్ల ఆధిక్యం!
టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1017 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్లో టీఆర్ఎస్కు 3,639 ఓట్లు రాగా.. బీజేపీకి 4, 656 ఓట్లు వచ్చాయి.
ఈ ఉప ఎన్నికలో ఏమాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్కు ప్రతి రౌండ్లోనూ కేవలం 200 లోపు ఓట్లు మాత్రమే వస్తున్నాయి. ఆరో రౌండ్లో కాంగ్రెస్కు కేవలం 180 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఆరో రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 1017 లీడ్ ఉండగా.. మొత్తానికి 3,186 మెజార్టీతో మొదటిస్థానంలో ఉంది.
ఐదో రౌండ్లో బీజేపీ 344 ఓట్ల ఆధిక్యం
ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4014 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,435 ఓట్లు, కాంగ్రెస్కు 132 ఓట్లు పోలయ్యాయి. ఐదో రౌండ్లో బీజేపీకి 344 లీడ్ రాగా, ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 2,169 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 20,158 ఓట్లు రాగా, బీజేపీకి 22,327, కాంగ్రెస్కు 811 ఓట్లు వచ్చాయి.
నాలుగో రౌండ్లో బీజేపీ 1,825 ఓట్ల ఆధిక్యం
నాలుగో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 3,882 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,444 ఓట్లు, కాంగ్రెస్కు 234 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్లో బీజేపీకి 562 లీడ్ రాగా, నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 1,825 ఓట్ల ముందంజలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ
కాంగ్రెస్కు ధీటుగా ప్రజా ఏక్తా పార్టీ దూసుకుపోతుంది. కాంగ్రెస్ అభ్యర్థి బలుమూరి వెంకట్ కంటే కూడా ప్రజా ఏక్తా పార్టీ సిలివేరు శ్రీకాంత్కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 119 ఓట్లు రాగా, ప్రజా ఏక్తా పార్టీకి 122 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో కాంగ్రెస్కు 220, ప్రజా ఏక్తా పార్టీకి 158 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్లో కాంగ్రెస్కు 107, శ్రీకాంత్కు 43 ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటి మేకర్.. ఇది కారు గుర్తును పోలి ఉండటం పెద్ద కన్ఫ్యూజన్ను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.
మూడో రౌండ్లో ఈటల ముందంజ
మూడో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1269 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్లో ఈటల రాజేందర్ 4064, గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 3153, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్కు 107 ఓట్లు పోలయ్యాయి. రోటీ మేకర్ గుర్తుకు 43 ఓట్లు, వజ్రం గుర్తుకు 22 ఓట్లు పోలయ్యాయి.
రెండో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం..
రెండో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4,659, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు 4,851, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్కు 220 ఓట్లు పోలయ్యాయి.
కాంగ్రెస్ కంటే రోటీ మేకర్ గుర్తుకే ఎక్కువ ఓట్లు
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్కు తొలి రౌండ్లో 122 ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటి మేకర్.. ఇది కారు గుర్తును పోలి ఉండటం పెద్ద కన్ఫ్యూజన్ను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అదే కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్కు 119 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
-తొలి రౌండ్లో బీజేపీ ఆధిక్యం..
ఈటల రాజేందర్కు 4,610 ఓట్లు పోలవ్వగా, గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4444 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్కు 119 ఓట్లు పోలయ్యాయి.
-పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం
-హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి.
ఓట్ల లెక్కింపు ప్రారంభం
కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల ప్రారంభమైంది. తొలుత 753 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించనున్నారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియనుంది. ఒక్కో రౌండ్కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.
తొలుత హుజూరాబాద్ మండలంలోని గ్రామాల ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదట పోతిరెడ్డిపేట, ఆఖరున శంభునిపల్లి ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో శనివారం జరిగిన పోలింగ్లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. దాంతో రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓట్లు 2,36,873 కాగా, ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 2,05,236. కాగా 1,02,523(87.05 శాతం) మంది పురుషులు, 1,02,712(86.25 శాతం) మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.