Huzurabad | హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం నువ్వానేనా అన్నట్లు ఉంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య స్వల్ప మెజార్టీ ఉండటడంతో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 11వ రౌండ్లో టీఆర్ఎస్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈటల రాజేందర్పై, గెల్లు శ్రీనివాస్ 367 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. 11వ రౌండ్లో టీఆర్ఎస్కు 4,326 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత 11వ రౌండ్ వరకూ 39,016 ఓట్లు టీఆర్ఎస్కు పోలయ్యాయి.