హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. నార్సింగీ పోలీసు స్టేషన్ పరిధిలోని పీరం చెరువు గ్రామంలో భార్య కళ్లేదుట భర్త భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేవన్ సిద్దప్ప అనే వ్యక్తి భార్యతో గొడవపడ్డాడు. వీరి మధ్య వాగ్వాదాం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆవేశానికి లోనైన భర్త ఆమె కళ్లెదుటే భవనం నుంచి దూకాడు.
దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందాడు. నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.