యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశానికి రెండు గంటల పడుతున్నది. స్వామివారి ఉదయం బ్రేక్ దర్శనానికి కూడా భక్తులు పోటెత్తారు.
కాగా, కొండపైకి వెళ్లే ఉచిత బస్సులు రద్దీగా ఉండటంతో మెట్ల మార్గంలో భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. అదేవిధంగా కొండపైన కార్ పార్కింగ్ లేకపోవడంతో కిందే నిలిపివేస్తున్నారు.