హైదరాబాద్: శ్రావణమాసం (Sravana Masam) మొదటి సోమవారం, నాగుల పంచమి (Nagula Panchami) కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హనుమకొండలోని (Hanumakonda) వేయి స్తంభాల గుడికి (1000 pillar temple) భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శివయ్య దర్శనానికి భక్తులు క్యూలైనన్లలో గంటలపాటు వేచిఉన్నారు. వేములవాడలోని (Vemulawada) రాజరాజేశ్వర స్వామివారి ఆలయం (Raja Rajeshwara swamy temple) భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక నాగుల పంచమి సందర్భంగా నాగేంద్రునికి పాలు సమర్పించుకున్నారు.