Prajavani | ప్రజా సమస్యలను పరిష్కరిస్తామిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో మంగళవారం జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జిదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని.. అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జికి ఒక నంబర్ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
అలాగే, అర్జిదారుల రిఫరెన్స్ కోసం సెల్ ఫోన్ నంబర్కు మెస్సేజ్ పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇవాళ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 5,324 వినతిపత్రాలు సమర్పించారు. ఇందులో 55శాతం డబుల్ బెడ్రూం ఇండ్లు, 30శాతం పెన్షన్లకు సంబంధించినవి ఉన్నాయని మిగతావి ఉద్యోగాలు, రెవెన్యూ తదితర సమస్యలపై అర్జీలు వచ్చినట్లుగా ప్రజాభవన్ వర్గాలు పేర్కొన్నాయి.