హైదరాబాద్ : జాతీయ లోక్అదాలత్లో భాగంగా తెలంగాణవ్యాప్తంగా శనివారం జరిగిన లోక్అదాలత్లో రికార్డు స్థాయిలో 3,02,768 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 2,83,007 కేసులో వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్ని వాదప్రతివాదులు ఏకాభిప్రాయంతో రాజీ చేసుకున్నారు. మిగిలిన 19,761 కేసులు ప్రీలిటిగేషన్ కేసులను కక్షిదారులు రాజీ చేసుకున్నారు.
మొత్తం మూడు లక్షలకుపైగా కేసులను పరిష్కారం చేయడం ద్వారా రూ.116.33 కోట్లను లబ్ధిదారులకు పరిహారంగా చెల్లింపులు జరిగాయని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నాయకత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ పీ నవీన్రావుల పర్యవేక్షణలో అన్ని కోర్టుల్లోను లోక్అదాలత్ల ద్వారా రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారమైనట్లు తెలిపారు.