నిజామాబాద్ సిటీ, జూన్ 5: గ్రామాల సర్వతోముఖా భివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. జడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశంలో భాగంగా సోమవారం వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహా రం, పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలన్నారు. పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వానకాలం సీజన్లో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సక్రమంగా అందేలా చూడాలన్నారు. మత్స్యశాఖ చేపడుతున్న కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం లేదని జడ్పీటీసీలు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి ఆహ్వానించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ రజితాయాదవ్, జడ్పీ సీఈవో గోవింద్, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, మార్క్ఫెడ్ శాఖ మేనేజర్ రంజిత్రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.
రెండేండ్లు పూర్తి చేసుకున్న జడ్పీ పాలకవర్గం
జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి రెం డు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సభ్యులు, అధికారులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏ.శ్రీనివాస్, రమణారావు, గోపాల్ నగేశ్, శేఖర్రెడ్డి, అంజయ్య, నీలంరెడ్డి, నాగారావు, శేఖర్రాజు తదితరులు పాల్గొన్నారు.