హైదరాబాద్ : కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. శ్రీశైలానికి 2,56,076 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో ఆరు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.90 అడుగుల నీరున్నది.
కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఎగువనున్న జూరాల ప్రాజెక్టుకు 22.21లక్షల క్యూసెక్కుల ఉండగా.. అధికారులు 45 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్ ఫ్లో 2,21,266 క్యూసెక్కులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.750 టీఎంసీలు నిల్వ ఉన్నది.
నాగార్జున సాగర్కు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. దీంతో డ్యామ్ పది గేట్లను ఎత్తి 1.49లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగర్లో ప్రస్తుతం నీటిమట్టం 589.90 అడుగులు ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310.55 టీఎంసీల నీరున్నది. జలాశయానికి 1.95లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. అదేస్థాయిలో అవుట్ ఫ్లో ఉన్నది.
నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సైతం వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయానికి 1.12లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 1.30లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. పూర్తిస్థాయిలో నీటితో కళకళలాడుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 90 టీఎంసీలు కాగా.. జలాశయంలో 89టీఎంసీలు.