యాదగిరిగుట్ట: యాదగిరి గుట్ట(Yadagirigutta)శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం భారీగా ఆదాయం సమకూరింది. ఒక్కరోజే రూ. 22,61,887 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 2,14,014, కైంకర్యాల ద్వారా రూ. 6,216, సుప్రభాతం ద్వారా రూ. 5,100 ఆదాయం(Income) వచ్చిందన్నారు.
పుష్కరిణీ ద్వారా రూ. 1,200,వ్రతాల ద్వారా రూ. 1,12,000,ప్రచార శాఖ ద్వారా రూ. 25,000, వీఐపీ దర్శనం ద్వారా రూ. 90,000,యాదరుషి నిలయము ద్వారా రూ. 52,192 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రసాదవిక్రయం ద్వారా ఆలయానికి రూ. 10,68,850,పాతగుట్ట ద్వారా రూ. 21,000, కల్యాణకట్ట ద్వారా రూ. 45,000,శాశ్వత పూజలు రూ. 15,000 కానుకల రూపేణా వచ్చాయని తెలిపారు. వాహన పూజల ద్వారా రూ. 6,900, కొండపైకి వాహనల ప్రవేశం ద్వారా రూ. 3,00,000,సువర్ణ పుష్పార్చన ద్వారా 86,232, వేద ఆశీర్వచనం ద్వారా రూ. 14,400,శివాలయం ద్వారా రూ. 9,000,అన్నదానము కింద రూ. 40,813,బ్రేక్ దర్శనం ద్వారా రూ. 1,48,500 వచ్చిందని వెల్లడించారు.
Read more : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆలయాల అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి https://www.ntnews.com/warangal-rural/cm-kcr-development-of-temples-led-by-chief-minister-kcr-minister-errabelli-995252