అయిజ: తుంగభద్ర బరాజ్కు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలో భారీ వానలు కురుస్తుండటంతో జలాయశయంలోకి వరద నీరు భారీగా చేరుతున్నది. ప్రస్తుతం 82,103 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా, 221 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1633 అడుగులు. ప్రస్తుతం 1621.19 అడుగుల వద్ద నీరు ఉన్నది. 105.788 టీఎంసీల నీటి నిల్వకు గాను 64.728 టీఎంసీల నీరు ఉంది. కర్ణాటకలోని ఎగువ భాగాన వానలు భారీగా కురుస్తుండటంతో ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని డ్యామ్ సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.