హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్లోకి (Himayat Sagar) 1,300 క్యూసెక్కుల వరద స్తున్నది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని మూసీనదికి (Moosi river) విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1761.45 అడుగుల వద్ద ఉన్నది. ఇక, ఉస్మాన్ సాగర్కు (Osman Sagar) 700 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 2 గేట్ల ద్వారా 216 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్సాగర్లో ప్రస్తుతం 1787.20 అడుగుల నీటిమట్టం ఉండగా, గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు.
కాగా, హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలతో నల్లగొండ (Nalgonda) జిల్లా కేతెపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు (Musi project) వరద పోటెత్తింది. దీంతో అధికారులు 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 17,250 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతేమొత్తం నీరు బయటకు వెళ్తున్నది. మూసీ పూర్తిస్థాయి నీటినిల్ల 4.46 టీఎంసీలు కాగా, ఇప్పుడు 3.81 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.