మహబూబ్నగర్: ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ప్రాజెక్టులోకి 17 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు 24,173 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.960 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జూరాలలో 9.657 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 8.531 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయంలోకి 23,586 క్యూసెక్కుల వరద వస్తుండగా, 21,517 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 587.90 అడుగుల వద్ద నీటి మట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 312.0450 టీఎంసీలు కాగా, 306.0410 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.