నిజామాబాద్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ నుంచి పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టులోకి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 22,187 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 718 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 107.7 అడుగుల వద్ద నీరు ఉన్నది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు. ఇప్పుడు 30.360 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూన్ 1 తర్వాత ప్రాజెక్టులోకి 12 టీఎంసీల నీరు వచ్చి చేరింది.