మహబూబ్నగర్: కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్రా నదికి వరద ప్రవాహం పెరుగుతున్నది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 54,726 క్యూసెక్కుల నీరు వస్తున్నది. 48,838 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100.85 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.