సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలోని కృష్ణవేణి చెరువులో మంగళవారం సాగించిన చేపల వేటలో సుమారు 20 కిలోలపైనే ఉన్న భారీ చేపలు లభ్యం కావడంతో జాలర్లు సంబురపడ్డారు. గత సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం 1.20 లక్షల చేప పిల్లలను చెరువులో వదిలింది.
అవి పెరిగి పెద్దవి కావడంతో మత్స్యకారులు వేటకు వెళ్లగా.. ఒక్క రోజే 12 క్వింటాళ్ల చేపలు దొరికాయి. చెరువు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లలను వదిలి తమకు జీవనోపాధి కల్పిస్తున్న
సీఎం కేసీఆర్కు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.
-మద్దూరు(ధూళిమిట్ట)