హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.