యాదగిరిగుట్ట, జనవరి 21 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. భక్తులతో మాడవీధులు, ప్రసాద విక్రయశాలలు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు రద్దీగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమ యం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 35వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఖజానాకు రూ.46,63,688 ఆదాయం సమకూరినట్టు ఈవో రామకృష్ణారావు తెలిపారు.