సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రముఖ శైవాలయం వేములవాడ (Vemulawada) శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రాజేశ్వరుని సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నది. వేకవజాము నుంచే స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఆలయంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. అర్చకులు స్వామివారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.