వేములవాడ: రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని క్షేత్రానికి భక్తజనులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోవడంతో స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం
పడుతున్నది. స్వామివారి ఆర్జిత సేవలు రద్దు చేసిన అధికారులు లఘు దర్శనం కల్పిస్తున్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.