యాదాద్రి, డిసెంబర్ 18 : యాదగిరీశుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతమండపం, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు సందడిగా మారాయి. ధర్మదర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనాలు కొనసాగాయి. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గోదాదేవి రంగనాయకస్వామి రచించిన పాశురాలను పఠించారు. సుమారు 38 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.47,71,692 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.