హైదరాబాద్: మృగశిర కార్తె (Mrigasira karthi) నాడు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాటుందని, వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం. దీంతో హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లు, రైతుబజార్లలో చేపల కోసం జనాలు క్యూకడుతున్నారు. జలపుష్పాల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కాగా, కార్తెను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెద్దఎత్తున చేపలు తెప్పించి అమ్ముతున్నారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ చేపల మార్కెట్కు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్లోని ఆకునీడు, భీమవరం నుంచి పెద్దఎత్తున చేపలు దిగుమతి అయ్యాయి.