జ్యోతినగర్, ఫిబ్రవరి 13: సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్కు చెందిన ఓ యువకుడికి టెలిగ్రామ్లో లింక్ పంపి రూ.17.80 లక్షలు స్వాహా చేశారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్కు చెందిన అవినాశ్ సెల్ఫోన్ టెలిగ్రామ్కు గత నెల గుర్తుతెలియని నంబర్ నుంచి లింక్ వచ్చింది. ‘కమీషన్ బేస్తో ఆన్లైన్ ఉద్యోగం ఉంది’ అంటూ దాని సారాంశం. లింక్ ఓపెన్ చేసిన అవినాశ్ అందులో పేర్కొన్నట్టుగా రూ.17.80 లక్షలు డిపాజిట్ చేసి వాళ్లు పెట్టిన టాస్క్ ఆడాడు. రెండు మూడు రోజులు ఆడి టాస్క్ కంప్లీట్ చేసినా ఎలాంటి కమీషన్ రాలేదు. కొద్దిరోజులు ఎదురుచూడగా.. అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో సైబర్ మోసమని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.