జగిత్యాల: జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతుండటంతో భారీ సంఖ్యలో ఆంజనేయ మాలదారులు తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే మాలధారులు దీక్ష విరమణ చేస్తున్నారు. స్వామివారిని 50 వేల మందికిపైగా దర్శించుకున్నారు. పెద్దఎత్తున భక్తులు తరలి రావడంతో కొండగట్టులో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సింధుశర్మ, అడిషనల్ ఎస్పీ రూపేష్ కుమార్ పరిశీలించారు.
వేములవాడ రాజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. దీంతో రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో గర్భగుడి దర్శనాలను అధికారులు రద్దుచేశారు. అదేవిధంగా అభిషేకాలు, అన్నపూజలు నిలిపివేశారు.