Free Bus For Women | జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ డ్రైవర్లు, ప్రయాణికులకు సంకటంగా మారింది. నిత్యం గొడవలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్న హైదరాబాద్ డిపో-2 బస్సు ఆదివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్లో పరిమితికి మించింది. జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా వద్ద మరికొందరు ఎక్కారు.
ప్రయాణికులు ఫుట్బోర్డుపై నిలబడటంతో బస్సు దిగాలని డ్రైవర్ సూచించాడు. వినకపోవడంతో బస్సును అక్కడే నిలిపివేసి వారు దిగితేనే ముందుకు వెళ్తానంటూ చెప్పడంతో ప్రయాణికులు, డ్రైవర్కు మధ్య గొడవ జరిగింది. దాదాపు అరగంట తర్వాత డ్రైవర్ మాట నెగ్గడంతో బస్సు ముందుకు కదిలింది.