టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అర్ధరాత్రి కేక్ కట్ చేయడంతోనే సంబురాలు మొదలయ్యాయి. వర్షాలు, వరదల నేపథ్యంలో ఆడంబరాలు వద్దన్న మంత్రి కేటీఆర్ సూచన మేరకు కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రమంతటా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద పలువురు నాయకులు, కేటీఆర్ అభిమానులు పేదలు, ఆర్తులను ఆదుకొన్నారు.