నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో దిగువ, మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా చూడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంత్రి ప్రశాంత్ రెడ్డిని కోరారు. హౌజింగ్ బోర్డ్ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తిన ఎమ్మెల్సీ కవిత పేద ప్రజలపై పడే భారాన్ని ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
హౌసింగ్ బోర్డు ఇప్పటి వరకు ప్రైవేటు స్థలాన్ని సేకరించి అనంతరం ఆర్థికంగా దిగువ, మధ్య తరగతి ప్రజలకు ఇచ్చేది. అయితే ప్రభుత్వానికి భూమి ఇచ్చిన యజమానులు తరుచుగా కోర్టులకు వెళ్లడం, ధరల పెరుగుదలతో రూ.18 కోట్ల అదనపు భారం పడుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ఈ సమస్యను అనేక సార్లు హౌసింగ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్న ఎమ్మెల్సీ కవిత, ఆర్థిక భారాన్ని మాఫీ చేసేలా ఏదైనా పరిష్కారం చూపాలని మంత్రిని కోరారు. ఈ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
Esha Gupta | ఇషా గుప్తా బికినీ సెగలు
తనను నిర్బంధించిన గదిని ఊడ్చిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?