ఖలీల్వాడీ, మార్చి 4 : ప్రజా సేవలో తాను ముందుంటానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తెలిపారు. రాజకీయ గురువు కేసీఆర్తోపాటు తన తండ్రి చూపిన మార్గంలోప్రజలకు సేవ చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిజామాబాద్లోని శ్రీరామ గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే బిగాల మహిళల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా మెప్మా ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యర్తలకు చీరలను పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ.. కరోనా మొదటి, రెండో దశల్లో మెప్మా ఆర్పీలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రాణాలను లెక్కచేయకుండా ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ప్రాణాలు కాపాడారని తెలిపారు. పోలీసులు, ఉద్యోగులు వారి అమూల్యమైన సేవలు అందించారని గుర్తుచేశారు. కరోనా సమయంలో సొంత ఖర్చుతో భోజనం ఏర్పాటు చేసినట్టు చెప్పారు.