బాన్సువాడ, నవంబర్ 20: పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఒక బట్టేబాజ్ అని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మైనార్టీల అభివృద్ధికి చేసిందేమీ లేదని, అదే కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్నిరంగాల్లో మైనార్టీలు అభివృద్ధి చెందారని వివరించారు. బీఆర్ఎస్తో బీజేపీ కలుస్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎనిమిది సీట్లే వస్తాయని, కానీ ఆ పార్టీలో 20 మంది సీఎం సీటును ఆశిస్తున్నారని ఎద్దేవా చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం నిత్యం శ్రమించే పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే నెలకో సీఎం మారుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని జనం నమ్మరని, మంచి చేసే వారినే ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు.
సీఎం అవుతానని రేవంత్రెడ్డి కలలు కంటున్నారని, ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడని జోస్యం చెప్పారు. తాను తప్పుచేశానని అనిపిస్తే క్షమించండి.. మంచిచేశానని అనిపిస్తే ఓటేసి గెలిపించండని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.