హైదరాబాద్ : నగరంలోని గోషామహల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహముద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహముద్ అలీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. పోలీసు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. కరోనా సమయంలో 62 మంది పోలీసులు మరణించారు. ఏడేండ్లలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా చేశామన్నారు. బోనాలు, రంజాన్ను ప్రశాంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. పోలీసు అమరవీరులకు ప్రభుత్వం తరపున శ్రద్ధాంజలి ఘటించామని హోంమంత్రి మహముద్ అలీ తెలిపారు.