హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడులకు త్వరలో విద్యుత్తు బిల్లుల భారం తప్పనున్నది. బడుల విద్యుత్తు కనెక్షన్లను కమర్షియల్ క్యాటగిరీ నుంచి డొమెస్టిక్ క్యాటగిరీకి ప్రభుత్వ మార్చనున్నది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలివ్వగా, త్వరలో పూర్తిస్తాయి అమలుకు విద్యాశాఖ అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో 26,074 బడులుండగా, వీటిల్లో 24,084 బడులకు విద్యుత్తు కనెక్షన్లున్నాయి. మరో 1,990 బడులకు ఇప్పటివరకు కరెంట్ కనెక్షన్లు లేవు. ఇటీవలికాలంలో విద్యుత్తు ఉపకరణాల వినియోగం పెరగడంతో బడులకు విద్యుత్తు బిల్లులు అమాంతం పెరుగుతున్నాయి. కంప్యూటర్ ల్యాబ్లు, ప్రయోగశాలలు, బోర్మోటర్లకు విద్యుత్తు వినియోగంతో బిల్లులు తలకుమించిన భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్తు కనెక్షన్ల క్యాటగిరీని మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. గృహజ్యోతి పథకంలో వర్తింపజేసే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే అంశంపై ఇటీవలే సీఎం రేవంత్రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. గృహ క్యాటగిరీకి మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
కొన్ని బడుల గత బిల్లులు..పాఠశాల బిల్లు మొత్తం