హైదరాబాద్: అరవై ఏండ్లపాటు తెలంగాణను (Telangana) ముంచిన, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు అణవేసి.. ఎంతో మందిని పొట్టపెట్టుకున్న కాంగ్రెస్పై (Congress) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఉచిత హామీలంటూ అలవికాని హామీలను గుప్పిస్తూ.. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న బీఆర్ఎస్ను (BRS) ఎలాగైనా ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న ఆ పార్టీపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇందులోభాగంగా రాష్ట్రంలో ప్రచారానికి వస్తున్న హస్తం నేతలకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటుచేస్తున్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ (Rahul Gandhi) పర్యటన నేపథ్యంలో శంషాబాద్లో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలసిన విషయం తెలిసిందే.
తాజాగా హైదరాబాద్ (Hyderabad) నగర శివార్లలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా భారీ హోర్డింగులు వెలిశాయి. ఉద్యమకారులు, విద్యార్థులను బలిగొన్న కాంగ్రెస్ను తెలంగాణలోకి రానివద్దని, బతకనివ్వొద్దంటూ ప్రజలను ఆలోచింపచేసేలా గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఈ హోర్డింగులను వాహనదారులు, సాధారణ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.