పాలకుర్తి, ఏప్రిల్17: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో అతి చిన్న తీర్థంకర విగ్రహంతోపాటు ధ్వజస్తంభ శాసనాన్ని గుర్తించినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా సో మవారం ఆయన గూడూరులో పర్యటించారు.
గతం లో ఇక్కడ బౌద్ధ స్తూపం గుర్తించామని, ప్రస్తుతం మరి న్ని చారిత్రక ఆధారాలు దొరికాయని పేర్కొన్నారు. తీర్థంకరుడి విగ్రహం అరచేతిలో ఇమిడే పరిమాణం లో ఉన్నదని, పోచమ్మ గుడి ముందున్న చెట్టుకింద కొన్ని విగ్రహాలు గతంలో జైన దేవాలయం ఉన్నట్టు తెలియజేస్తున్నాయని ఆయన చెప్పారు.