BRSV Protest | అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్వీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని, వాహనాల్లో నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
విద్యారంగంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ అసెంబ్లీని ముట్టడించారు. ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. విద్యారంగంపై సర్కార్కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా గోస పుచ్చుకుంటుందని కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎదుట ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ నేతలను పంజాగుట్ట, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. విడతల వారీగా బీఆర్ఎస్వీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి వస్తుండటంతో వారిని అడ్డుకోవడానికి పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు.
విద్యా రంగంపై రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా అసెంబ్లీని ముట్టడించిన బీఆర్ఎస్వీ
నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు pic.twitter.com/jIW28WslB7
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2026