హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రోజుకు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. ఫిబ్రవరి 28న పీక్ డిమాండ్ 17,083 మెగావాట్లుగా నమోదైంది. ఈ సంవత్సరం ఇదే రికార్డు.
నిరుడు రికార్డు పీక్ డిమాండ్ మార్చి 20న 17,162 మెగావాట్లుగా నమోదవగా, ఈ ఏడాది ఈ రికార్డు దాటుతుందనే అంచనాలు ఉన్నాయి. నిరుడు ఫిబ్రవరి 28న 16,392 మెగావాట్లు, మార్చి 1న 16,252 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. నిరుటి కంటే ఈ ఏడాది ఇప్పటికే 700 మెగావాట్లు ఎక్కువ నమోదవడం గమనార్హం.